సింధు అభ్యర్థనకు ‘సాయ్’ ఓకే
ABN , First Publish Date - 2020-12-19T06:20:58+05:30 IST
టోర్నీలకు తనతోపాటు ఫిజియో, ఫిట్నెస్ ట్రెయినర్ను తీసుకువెళ్లేందుకు ఒలింపిక్స్ రజత పతక విజే త పీవీ సింధు చేసిన అభ్యర్థనను

న్యూఢిల్లీ: టోర్నీలకు తనతోపాటు ఫిజియో, ఫిట్నెస్ ట్రెయినర్ను తీసుకువెళ్లేందుకు ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు చేసిన అభ్యర్థనను భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఆమోదించింది. దాంతో జనవరిలో థాయ్లాండ్లో జరిగే రెండు టోర్నీలతోపాటు ఒకవేళ వరల్డ్ టూర్ ఫైనల్స్కు సింధు అర్హత సాధిస్తే.. ఆ మూడు టోర్నీలకు ఫిజియో, ఫిట్నెస్ ట్రెయినర్ను సింధు వెంట తీసుకొనివెళ్లే అవకాశం ఏర్పడింది.