దూకుడుగా ఆడుతున్న ముంబై ఇండియన్స్

ABN , First Publish Date - 2020-09-24T02:14:59+05:30 IST

ఐపీఎల్‌ 2020లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాభలిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ చేయడం విశేషం...

దూకుడుగా ఆడుతున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్‌ 2020లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాభిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచినా కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ చేయడం విశేషం. బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలుత తడబడినా ఆ తర్వాత పుంజుకుంది. రెండో ఓవర్‌లో శివమ్ మావి వేసిన రెండో బంతికే ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఫీల్డర్ నిఖిల్ నాయక్ చేతికి చిక్కి ఔటయ్యాడు. ఆ తర్వాత రెండో వికెట్‌కి రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్‌‌లు 90 రన్లు జోడించి భారీ భాగస్వామ్యంతో అద్భుతంగా రాణించారు. 


పదకొండో ఓవర్ అయిదో బంతికి నారైన్ వేసిన బంతికి రోహిత్ సింగిల్ తీయగా మరో పరుగు కోసం ప్రయత్నిస్తూ యాదవ్ రనౌట్ అయ్యాడు. చివరి సమాచారం వరకు ముంబై ఇండియన్స్ స్కోరు మొత్తం 12 ఓవర్లకు 106 రన్స్, 2 వికెట్లు.

Updated Date - 2020-09-24T02:14:59+05:30 IST