ధోనీ సేన ముందు 168 పరుగుల లక్ష్యాన్ని నిలిపిన నైట్‌రైడర్స్

ABN , First Publish Date - 2020-10-08T03:08:48+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో...

ధోనీ సేన ముందు 168 పరుగుల లక్ష్యాన్ని నిలిపిన నైట్‌రైడర్స్

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో కోల్‌కత్తా జట్టు ఆలౌట్ అయింది. నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. చెన్నై ముందు 168 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఓపెనర్ గిల్ 11 పరుగులతో నిరాశపరిచినప్పటికీ మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి మాత్రం నిలకడగా ఆడి రాణించాడు. 51 బంతుల్లో 3 సిక్స్‌లు, 8 ఫోర్లతో 81 పరుగులు చేశాడు. త్రిపాఠిని మినహాయిస్తే మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయకపోవడం గమనార్హం.


నితీష్ రాణా(9), సునీల్ నరైన్(17), కమ్మిన్స్(17), దినేష్ కార్తీక్(12), మోర్గాన్(7), రస్సెల్ 2 పరుగులు చేశాడు. నగర్‌కోటి, శివమ్ మావి డకౌట్‌గా వెనుదిరిగాడు. వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగు చేసి రనౌట్‌‌గా పెవిలియన్ బాట పట్టాడు. చెన్నై బౌలర్లలో బ్రావోకు 3 వికెట్లు, కర్ణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్, శామ్ కరన్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి.

Updated Date - 2020-10-08T03:08:48+05:30 IST