కోహ్లీ అర్ధ సెంచరీ.. నెమ్మదిగా సాగుతున్న భారత ఇన్నింగ్స్
ABN , First Publish Date - 2020-12-17T20:51:32+05:30 IST
బోర్డర్-గవాస్కర్ ట్రోపీలో భాగంగా అడిలైడ్లో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత ఇన్నింగ్స్ నిలకడగా సాగుతోంది. ఈ మ్యాచ్లో

అడిలైడ్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్లో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత ఇన్నింగ్స్ నిలకడగా సాగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ పృథ్వీషా డకౌట్ అయ్యాడు. 32 పరుగుల వద్ద మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (17) కూడా వెనుదిరిగాడు. కమిన్స్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. చతేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డుకు పరుగులు జత చేరుస్తూ ముందుకెళ్లారు.
ఇన్నింగ్స్ గాడిన పడిందనుకుంటున్న సమయంలో 43 పరుగులు చేసిన పుజారా.. లియాన్ బౌలింగులో లబుషేన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. అజింక్య రహానేతో కలిసి జాగ్రత్తగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 66 ఓవర్లు పూర్తయ్యాయి. భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కోహ్లీ 55, రహానే 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.