కశ్మీర్ ఎప్పటికీ మాదే.. అఫ్రిదీకి ధవన్ కౌంటర్

ABN , First Publish Date - 2020-05-18T04:39:35+05:30 IST

కశ్మీర్ విషయంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలకు భారత క్రికెటర్లు ఘాటుగా కౌంటర్లు వేస్తున్నారు.

కశ్మీర్ ఎప్పటికీ మాదే.. అఫ్రిదీకి ధవన్ కౌంటర్

న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెటర్లు ఘాటుగా కౌంటర్లు వేస్తున్నారు. హర్భజన్, యువరాజ్, గంభీర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఇప్పుడు ఈ జాబితాలో డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ కూడా చేరాడు. షాహిద్ అఫ్రిదీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ధవన్ ఘాటుగా స్పందించాడు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఈ సమయంలో కూడా కశ్మీర్ సమస్యను లేవనెత్తినందుకు అఫ్రిదీపై మండిపడ్డాడు. ‘కశ్మీర్ ఒకప్పుడు మాదే. ఇప్పుడూ మాదే. భవిష్యత్తులోనూ మాదే. 22కోట్ల మంది సైన్యాన్ని తీసుకొచ్చినా సరే. మా వాళ్లు ఒక్కొక్కరు లక్షమంది సైన్యంతో సమానం. మిగతా లెక్కలు మీరే చేసుకోండి’ అని ధవన్ ట్వీట్ చేశాడు.

Updated Date - 2020-05-18T04:39:35+05:30 IST