అలా చేయడం అందరి బాధ్యత: కపిల్ దేవ్

ABN , First Publish Date - 2020-10-15T00:47:03+05:30 IST

అలా చేయడం అందరి బాధ్యత: కపిల్ దేవ్

అలా చేయడం అందరి బాధ్యత: కపిల్ దేవ్

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వినూత్న రూపంలో చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతూ ప్రముఖుల మన్నలను పొందుతోంది. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని సుందర్ నగర్‌లో ఉన్న తన నివాసంలో క్రికెట్ దిగ్గజం, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మొక్కలు నాటారు. 


గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, వాతావరణ కాలుష్యం తగ్గి మంచి వాతావరణం కావాలని ఆశిద్దామని కపిల్ దేవ్ అన్నారు. అందుకోసం భారతీయులందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడం మన అందరి బాధ్యత అని కపిల్ దేవ్ అన్నారు.



Updated Date - 2020-10-15T00:47:03+05:30 IST