తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ధవన్ రనౌట్
ABN , First Publish Date - 2020-09-21T01:19:18+05:30 IST
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న పోరులో ఢిల్లీ కేపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధవన్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు బంతులు

దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న పోరులో ఢిల్లీ కేపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధవన్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొన్న ధవన్ అనవసరంగా రనౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్లో దూరంగా వెళ్తున్న బంతిని కీపర్ వెనక్కి ఆడిన ధవన్ పరుగు ఆశించి క్రీజులో దాదాపు సగం దూరం వచ్చేశాడు. అయితే పృథ్వీషా మాత్రం క్రీజు నుంచి కదలకపోవడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే బంతి అందుకున్న రాహుల్ దానిని గౌతమ్కు అందించడంతో అతడు వికెట్లను గిరాటేశాడు. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిశాయి. ఢిల్లీ వికెట్ నష్టానికి 8 వికెట్లు చేసింది. పృథ్వీషా, షిమ్రన్ హెట్మైర్ క్రీజులో ఉన్నారు.