‘ఆసియా బ్యాడ్మింటన్‌’ నుంచి వైదొలగిన భారత మహిళల జట్టు

ABN , First Publish Date - 2020-02-08T08:49:43+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా భారత మహిళల జట్టు ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి వైదొలగింది. అయితే, పురుషుల జట్టు మాత్రం టోర్నీలో ...

‘ఆసియా బ్యాడ్మింటన్‌’ నుంచి వైదొలగిన భారత మహిళల జట్టు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా భారత మహిళల జట్టు ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి వైదొలగింది. అయితే, పురుషుల జట్టు మాత్రం టోర్నీలో పోటీపడుతుందని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) శుక్రవారం ప్రకటించింది. ఆసియా చాంపియన్‌షిప్‌ ఈనెల 11 నుంచి 16 వరకు పిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరగనుంది. కరోనా వైరస్‌ శరవేగంగా ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోందన్న వార్తలు వెలువడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాయ్‌ తెలిపింది. 

Updated Date - 2020-02-08T08:49:43+05:30 IST