రెండో వన్డేలోనూ భారీ స్కోర్ దిశగా ఆసీస్ జట్టు
ABN , First Publish Date - 2020-11-29T17:49:55+05:30 IST
భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా రెండో వన్డే కొనసాగుతోంది. రెండో వన్డేలోనూ ఆసీస్ బ్యాట్స్మన్ తమ జోరు కొనసాగిస్తున్నారు. 40 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ జట్టు రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 275 పరుగులు చేసి..
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా రెండో వన్డే కొనసాగుతోంది. రెండో వన్డేలోనూ ఆసీస్ బ్యాట్స్మన్ తమ జోరు కొనసాగిస్తున్నారు. 40 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ జట్టు రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 275 పరుగులు చేసి.. భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. క్రీజులో స్మిత్ 57 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ తో.. 88 రన్స్ చేసి దూకుడుగా ఆడుతున్నారు. స్మిత్కి తోడుగా లబుషేన్ 38 బంతుల్లో 38 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.
అంతకుముందు ఆసీస్ ఓపెనర్ల జోరుకు భారత పేసర్ షమీ బ్రేక్ వేశాడు. ఓపెనర్లుగా వచ్చిన వార్నర్ 77 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 83 పరుగులు చేసి రనౌట్ కాగా.. ఫించ్ (69 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్తో) 60 పరుగుల వద్ద ఔటయ్యాడు.