చెస్ ఒలింపియాడ్లో భారత్ తీన్మార్
ABN , First Publish Date - 2020-08-22T07:40:44+05:30 IST
ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్ హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టింది. శుక్రవారం ప్రారంభమైన ఈ పోటీల్లో పూల్-ఏలోని భారత్ తొలి రౌండ్లో 6-0తో జింబాబ్వేపై, రెండో రౌండ్లో 4-2తో
న్యూఢిల్లీ: ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్ హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టింది. శుక్రవారం ప్రారంభమైన ఈ పోటీల్లో పూల్-ఏలోని భారత్ తొలి రౌండ్లో 6-0తో జింబాబ్వేపై, రెండో రౌండ్లో 4-2తో వియత్నాంపై, మూడో రౌండ్లో 5.5-0.5తో ఉజ్బెకిస్థాన్పై నెగ్గింది. వరుస విజయాలతో పూల్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ ఆరు పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, జర్మనీ నిలిచాయి. ఇక, తొలి రెండు రౌండ్లలో పోటీకి దిగని దిగ్గజం ఆనంద్ మూడో రౌండ్లో నొడిబేక్ అబుసాత్రోవ్ (ఉజ్బెకిస్థాన్) తలపడి 76 ఎత్తుల తర్వాత డ్రాగా ముగించాడు. తెలుగు గ్రాండ్మాస్టర్లు హారిక, హంపి ఆడిన రెండు గేమ్ల్లోనూ విజయాలు సాధించగా.. హరికృష్ణ ఒక గేమ్ను డ్రా చేసుకుని మరో గేమ్లో గెలుపొందాడు.