పేస్‌ జోడీ మెరిసినా..

ABN , First Publish Date - 2020-03-08T09:45:11+05:30 IST

పేస్‌ జోడీ భారత్‌ను మ్యాచ్‌లో నిలిపినా.. యువ ఆటగాళ్లు విఫలం కావడంతో పరాజయం తప్పలేదు. డేవిస్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో...

పేస్‌ జోడీ మెరిసినా..

  • 1-3తో ఓడిన భారత్‌
  • క్రొయేషియాతో డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌

జాగ్రెబ్‌: పేస్‌ జోడీ భారత్‌ను మ్యాచ్‌లో నిలిపినా.. యువ ఆటగాళ్లు విఫలం కావడంతో పరాజయం తప్పలేదు. డేవిస్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌ 1-3తో క్రొయేషియా చేతిలో పరాజయం పాలైంది. శనివారం జరిగిన డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌-రోహన్‌ బోపన్న జోడీ 6-3, 6-7(9), 7-5తో మేట్‌ పావిక్‌-ఫ్రాంకో స్కుగోర్‌పై గెలిచారు. డబుల్స్‌ మ్యాచ్‌ నెగ్గడంతో 1-2తో భారత్‌ మ్యాచ్‌లోకి వచ్చినా.. తర్వాత జరిగిన తొలి రివర్స్‌ సింగిల్స్‌లో సుమీత్‌ నగల్‌ ఓటమితో ఫలితం తేలిపోయింది. సుమీత్‌ 6-0, 6-1తో సిలిచ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రోజు మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ 6-7(8), 6-7(8)తో సిలిచ్‌ చేతిలో, ప్రజ్ఞేష్‌ గుణేశ్వరన్‌ 6-3, 4-6, 2-6తో బోర్నా చేతిలో ఓడారు.

Updated Date - 2020-03-08T09:45:11+05:30 IST