ధోనీ ‘లక్ష విరాళం’పై సాక్షి ఆగ్రహం

ABN , First Publish Date - 2020-03-28T09:48:48+05:30 IST

భారత మాజీ కెప్టెన్‌ ధోనీని అవమానపరుస్తూ కరోనా నిధికి కేవలం రూ.లక్ష విరాళంగా ప్రకటించినట్టు వస్తున్న వార్తలపై మహీ భార్య సాక్షీ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం

ధోనీ ‘లక్ష విరాళం’పై సాక్షి ఆగ్రహం

రాంచీ: భారత మాజీ కెప్టెన్‌ ధోనీని అవమానపరుస్తూ కరోనా నిధికి కేవలం రూ.లక్ష విరాళంగా ప్రకటించినట్టు వస్తున్న వార్తలపై మహీ భార్య సాక్షీ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సున్నితమైన సమయంలో తప్పుడు వార్తలను మీడియా సంస్థలు ప్రసారం చేయవద్దని అభ్యర్థిస్తున్నా. బాధ్యతాయుతమైన జర్నలిజం కనుమరుగైనందుకు ఆశ్చర్యపోతున్నా’ అని సాక్షి ట్వీట్‌ చేసింది. అయితే రూ. 12.5 లక్షలు విరాళంగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పుణెకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థకు ధోనీ రూ. లక్ష విరాళంగా ఇచ్చాడే తప్ప కరోనా నిధికి కాదని ఓ వార్తా సంస్థ తెలిపింది.  

Updated Date - 2020-03-28T09:48:48+05:30 IST