డుప్లెసి ‘డబుల్’ మిస్ సౌతాఫ్రికా 621
ABN , First Publish Date - 2020-12-29T06:34:11+05:30 IST
శ్రీలంకతో తొలి టెస్ట్లో మిడిలార్డర్ బ్యాట్స్మన్ డుప్లెసి (199) ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే టెయిలెండర్ కేశవ్ మహరాజ్ (
సెంచూరియన్: శ్రీలంకతో తొలి టెస్ట్లో మిడిలార్డర్ బ్యాట్స్మన్ డుప్లెసి (199) ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే టెయిలెండర్ కేశవ్ మహరాజ్ (73)తో కలిసి జట్టు ఆధిక్యాన్ని 200కు పైగా చేర్చాడు. వీరు ఏడో వికెట్కు 133 రన్స్ జోడించడంతో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 621 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 225 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక సోమవారం, మూడోరోజు ఆట ఆఖరికి 65/2 స్కోరు చేసింది.