చైనా ఉత్పత్తులను వాడొద్దు
ABN , First Publish Date - 2020-06-18T07:37:57+05:30 IST
చైనా ఉత్పత్తుల వాడకాన్ని భారతీయులు తక్షణమే నిలిపి వేయాలని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కోరాడు. ఇండో-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు చనిపోవడం తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని సుశీల్

న్యూఢిల్లీ: చైనా ఉత్పత్తుల వాడకాన్ని భారతీయులు తక్షణమే నిలిపి వేయాలని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కోరాడు. ఇండో-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు చనిపోవడం తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని సుశీల్ విచారం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచమంతా ఏకమై కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఈ క్లిష్ట సమయంలో చైనా ఇలాంటి చర్యలకు పాల్పడడం బాధాకరం. చైనా గురించి తెలిశాక కూడా మనం వాళ్లతో సంబంధాలు కొనసాగించడం అనవసరం. చైనా ఉత్పత్తులను వాడొద్దు. ఇకనుంచి వాళ్ల ఉత్పత్తులను మన దేశంలోకి అనుమతించకూడదు’ అని సుశీల్ సూచించాడు.