ధోనీ దృష్టంతా దానిపైనే: ఆకాశ్ చోప్రా

ABN , First Publish Date - 2020-08-08T02:40:07+05:30 IST

భారతజట్టులోకి పునరాగమనంపై మాజీ సారధి ధోనీ మధనపడటంలేదని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పాడు.

ధోనీ దృష్టంతా దానిపైనే: ఆకాశ్ చోప్రా

ముంబై: భారతజట్టులోకి పునరాగమనంపై మాజీ సారధి ధోనీ మధనపడటంలేదని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పాడు. వ్యక్తిగత ప్రదర్శన గురించో, టీమిండియాలోకి పునరాగమనం గురించో ఆలోచించే స్థాయిని ధోనీ దాటేశాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్-13లో ధోనీ దృష్టంతా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టు విజయంపైనే కేంద్రీకృతమైందని తెలిపాడు. ‘ఈ ఐపీఎల్‌లో ధోనీ ఆలోచించేది ఒక్కటే. సీఎస్‌కే ఎలా ఆడుతుందని. ఎందుకంటే సీఎస్‌కే గెలుపోటములు ధోనీతో ముడిపడి ఉంటాయి’ అని చోప్రా పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-08T02:40:07+05:30 IST