మరో రికార్డును సొంతం చేసుకున్న ఏబీ డెవిలియర్స్
ABN , First Publish Date - 2020-09-22T10:32:07+05:30 IST
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరపున ఆడి 200 సిక్సులు కొట్టిన
న్యూఢిల్లీ: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరపున ఆడి 200 సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలోకి తాజాగా దక్షిణ ఆఫ్రికా ఆటగాడు ఏబీ డెవిలియర్స్ చేరాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో కేవలం క్రిస్ గేల్ మాత్రమే ఉన్నాడు. గేల్ ఆర్సీబీ టీంలో ఉన్నప్పుడు మొత్తం 239 సిక్సులు బాదాడు. సోమవారం జరిగిన మ్యాచ్తో ఏబీ డెవిలియర్స్ కూడా 200 సిక్సులు పూర్తిచేసి ఈ జాబితాలోకి వచ్చేశాడు. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఏబీ డెవిలియర్స్ 30 బంతుల్లో 51 పరుగులు(రెండు సిక్సులు, నాలుగు బౌండరీలు) చేశాడు. ఈ మ్యాచ్లో సన్రైజర్స్పై బెంగళూరు జట్టు పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక గేల్, డెవిలియర్స్ తర్వాత 190 సిక్సులతో విరాట్ కోహ్లీ 200 సిక్సుల చేరువలో ఉన్నాడు.