కరోనాతో పోరు టెస్టు మ్యాచులాంటిది: కుంబ్లే

ABN , First Publish Date - 2020-05-10T03:01:13+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో జరుగుతున్న పోరాటంపై స్పిన్ మాంత్రికుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడారు.

కరోనాతో పోరు టెస్టు మ్యాచులాంటిది: కుంబ్లే

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో జరుగుతున్న పోరాటంపై స్పిన్ మాంత్రికుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడారు. ఈ పోరు టెస్టు మ్యాచులాంటిదని ఆయన అన్నారు. ‘తొలి ఇన్నింగ్సులో మనం కొంచెం ముందున్నామని సంతృప్తి పడకూడదు. రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితి మారిపోవచ్చు’ అని కుంబ్లే హెచ్చరించారు. కరోనాపై గెలవాలంటే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం ఉంటే సరిపోదని, పూర్తిగా మ్యాచ్ గెలవాలని చెప్పారు.

Updated Date - 2020-05-10T03:01:13+05:30 IST