అన్ని మ్యాచ్లూ ఫిక్స్..!
ABN , First Publish Date - 2020-05-31T09:00:31+05:30 IST
అన్ని క్రికెట్ మ్యాచ్లూ ఫిక్స్ అయినవేనని బుకీ సంజీవ్ చావ్లా సంచలన విషయాలు బయటపెట్టాడు. దీని వెనుక పెద్ద మాఫియా నడుస్తుందని తెలిపాడు...
పోలీసుల దర్యాప్తులో బుకీ చావ్లా వెల్లడి
న్యూఢిల్లీ: అన్ని క్రికెట్ మ్యాచ్లూ ఫిక్స్ అయినవేనని బుకీ సంజీవ్ చావ్లా సంచలన విషయాలు బయటపెట్టాడు. దీని వెనుక పెద్ద మాఫియా నడుస్తుందని తెలిపాడు. ఏ క్రికెట్ మ్యాచ్ కూడా నిజాయతీగా జరగదని ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో చావ్లా ఆరోపించాడు. మనం చూస్తున్న మ్యాచ్లన్నీ.. సినిమా తరహాలో ఎవరో ఒకరు దర్శకత్వం చేసినవేనన్నాడు. ఈ విషయంలో అండర్వరల్డ్ మాఫియా భాగస్వామ్యం అయ్యిందనీ.. ఎవరైనా సమాచారం లీక్ చేస్తే వాళ్లు అతణ్ని చంపేస్తారని పోలీసులకు చావ్లా చెప్పినట్టు సమాచారం. మ్యాచ్ ఫిక్సింగ్లో తనకూ భాగం ఉన్నట్టు చావ్లా అంగీకరించాడని పోలీసులు తెలిపారు. 2000లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే సిరీ్సలో చావ్లా మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.