పన్నెండొదల కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయికి సువర్ణావకాశం
ABN , First Publish Date - 2020-05-22T01:31:32+05:30 IST
లాక్డౌన్లో తన తండ్రితో కలిసి గురుగ్రామ్ నుంచి బిహార్ వరకూ సైకిల్ తొక్కిన జ్యోతి అనే అమ్మాయికి సువర్ణావకాశం లభించింది. ట్రైనీగా తనకు అవకాశం ఇస్తున్నట్లు
లాక్డౌన్లో తన తండ్రితో కలిసి గురుగ్రామ్ నుంచి బిహార్ వరకూ సైకిల్ తొక్కిన జ్యోతి అనే అమ్మాయికి సువర్ణావకాశం లభించింది. ట్రైనీగా తనకు అవకాశం ఇస్తున్నట్లు ఇండియాన్ సైకిల్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. 15 సంవత్సరాల జ్యోతి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గురుగ్రామ్ నుంచి బిహార్ వరకూ తన తండ్రిని వెంటబెట్టుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఐసీఎఫ్.. అన్ని ఖర్చులతో ఆమెకు ట్రైనింగ్ అందిస్తామని స్పష్టం చేసింది.
‘‘1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమెలో అసాధ్యమైన ప్రతిభ ఉంది. ఏడు లేదా ఎనిమిది ప్రమాణాలను తాను దాటితే.. తను జాతీయ జట్టులోకి ఎంపిక అవుతుంది. అంతేకాక.. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు’’ అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.