కరోనాపై పోరుకు.. రూ. 51 కోట్ల విరాళం ప్రకటించిన బీసీసీఐ

ABN , First Publish Date - 2020-03-31T00:07:53+05:30 IST

దేశాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా వైరస్‌పై పోరుకు దేశం మొత్తం ఏకమైంది. సామాన్యులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు,

కరోనాపై పోరుకు.. రూ. 51 కోట్ల విరాళం ప్రకటించిన బీసీసీఐ

ముంబై: దేశాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా వైరస్‌పై పోరుకు దేశం మొత్తం ఏకమైంది. సామాన్యులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, కంపెనీలు.. ఇలా అందరూ తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. విపత్కర సమయంలో ఏకతాటిపైకి వచ్చి కోవిడ్ మహమ్మారిపై యుద్ధానికి ముందుకొచ్చారు. ఇక, తాజా, మాజీ క్రికెటర్లు అయితే ఈ విషయంలో చాలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ మేమున్నామని హామీ ఇస్తున్నారు. 


టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించగా, మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేదల కోసం రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని విరాళంగా ఇచ్చాడు. సురేశ్ రైనా రూ. 52 లక్షలు, అజింక్య రహానే రూ. 10 లక్షల సాయం ప్రకటించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా తన వంతు సాయం అందిస్తానని ముందుకొచ్చాడు. భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తన ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. 16 ఏళ్ల మహిళా క్రికెటర్ రిచా ఘోష్ లక్ష రూపాయలు ఇచ్చింది. బెంగాల్, ముంబై, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాయి. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 51 కోట్ల విరాళం ప్రకటించింది.   

Updated Date - 2020-03-31T00:07:53+05:30 IST