బాక్సింగ్ డే టెస్టు.. ముగిసిన తొలిరోజు ఆట

ABN , First Publish Date - 2020-12-26T18:36:00+05:30 IST

బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో వికెట్ కోల్పోయి 36 పరుగులు.

బాక్సింగ్ డే టెస్టు.. ముగిసిన తొలిరోజు ఆట

మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్: బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో వికెట్ కోల్పోయి 36 పరుగులు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్, పుజారా ఉన్నారు. అంతకుముందు  దగ్గర టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్ అయ్యాడు.  


ఇదిలా ఉంటే, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను 195 పరుగులకే పరిమితం చేశారు భారత బౌలర్లు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీసుకోగా, అశ్విన్ మూడు, సిరాజ్ రెండు, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో మర్నూస్(48), హెడ్(38), వేడ్ 30 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జో బర్న్స్ డకౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు చిక్కాడు. ఆతర్వాత జట్టు స్కోర్ 35 పరుగుల దగ్గర వేడ్ అవుటవ్వగా, మరికాసేపటికే స్మిత్ డకౌట్ అయ్యాడు. 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మార్నస్, హెడ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ జోడీని బుమ్రా విడగొట్టాడు. 124 పరుగుల దగ్గర నాలుగో వికెట్‌గా హెడ్ పెవిలియన్ చేరాడు. హాఫ్ సెంచరీ దిశగా వెళుతున్న మార్నస్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో 134 పరుగులకు ఆసీస్ 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ ఎక్కువ సేపు కుదురుకోలేకపోయారు. మరో 61 పరుగులకు ఆసీస్ మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. టీమిండియా పక్కాగా బౌలింగ్ చేయడంతో కంగారులు 195 పరుగులు మాత్రమే చేశారు. 

Updated Date - 2020-12-26T18:36:00+05:30 IST