ఆయన్ను ఇంత సంతోషంగా ఎప్పుడూ చూళ్లేదు.. అశ్విన్ భార్య ట్వీట్!

ABN , First Publish Date - 2020-12-30T13:14:44+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారతజట్టు ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైనా.. ఆ అవమానాన్ని తట్టుకొని ప్రతీకారం తీర్చుకుంది.

ఆయన్ను ఇంత సంతోషంగా ఎప్పుడూ చూళ్లేదు.. అశ్విన్ భార్య ట్వీట్!

మెల్‌బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారతజట్టు ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైనా.. ఆ అవమానాన్ని తట్టుకొని ప్రతీకారం తీర్చుకుంది. దీంతో భారత అభిమానులు, ఆటగాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు. దీనిపై భారత స్పినన్నర్ రవచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి స్పందించింది. మ్యాచ్ తర్వాత భర్త ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్తూ ఓ ట్వీట్ చేసింది. ‘‘చాలాసార్లు టెస్టు మ్యాచులు ఆడిన తర్వాత నేను అశ్విన్‌ను చూశా. తనతో మాట్లాడా. కానీ అతను ఎప్పుడూ ఇంత సంతోషంగా కనిపించలేదు. సరిగ్గా చెప్పుకుంటే గడిచిన పదేళ్లలో ఎప్పుడూ అశ్విన్‌ను ఇంత సంతోషంగా చూళ్లేదు’’ అని ప్రీతి ట్వీట్ చేసింది.

Updated Date - 2020-12-30T13:14:44+05:30 IST