అర్జునకు అంకిత, శరణ్
ABN , First Publish Date - 2020-05-18T09:15:35+05:30 IST
ఆసియా క్రీడల పతక విజేతలు అంకితా రైనా, దివిజ్ శరణ్ను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఆలిండియా టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) నామినేట్ చేసింది...

ఏఐటీఏ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల పతక విజేతలు అంకితా రైనా, దివిజ్ శరణ్ను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఆలిండియా టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) నామినేట్ చేసింది. డేవిస్ కప్ మాజీ కోచ్ నందన్బాల్ (60) పేరును ‘ధ్యాన్చంద్’ పురస్కారానికి ప్రతిపాదించారు. 27 ఏళ్ల అంకిత 2018 ఆసియా క్రీడల్లో మహిళల సింగి ల్స్లో కాంస్య పతకం సాధించింది. ఫెడ్క్పలోనూ ఆమె అద్భుతంగా రాణించింది. వరల్డ్కప్ ప్లేఆఫ్స్కు భారత్ తొలిసారి క్వాలిఫై కావడంలోనూ కీలకపాత్ర పోషించింది. ఢిల్లీకి చెందిన దివిజ్ శరణ్ వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్నతో కలిసి 2018 ఆసియా క్రీడల్లో డబుల్స్లో స్వర్ణం గెలిచాడు. 2019లో అతను రెండు ఏటీపీ టైటిళ్లు నెగ్గాడు. కాగా, భారత డేవిస్ కప్ మాజీ ఆటగాడైన నందన్బాల్.. రిటైర్మెంట్ తర్వాత చాన్నాళ్లు డేవిస్ కప్ కోచ్గా పని చేశాడు.