ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుంది.. అదీ ఫ్యాన్స్‌ లేకుండానే: కుంబ్లే

ABN , First Publish Date - 2020-05-28T18:25:40+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రద్దు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాదే జరుగుతుందని టీం ఇండియా మాజీ కెప్టెన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రధాన కోచ్

ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుంది.. అదీ ఫ్యాన్స్‌ లేకుండానే: కుంబ్లే

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రద్దు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాదే జరుగుతుందని టీం ఇండియా మాజీ కెప్టెన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఐపీఎల్ ఫ్యాన్స్ లేకుండా జరుగుతుందని ఆయన అన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. 


దీనిపై అనిల్ మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ జరుగుతుందని ఇప్పటికే నమ్మకం ఉంది. స్టేడియంలలో ప్రేక్షకులు ఉండే అవకాశం లేదు. మూడు లేదా నాలుగు వేదికలు ఉంటాయి. ఇప్పటికీ అవకాశం ఉందనే అనిపిస్తుంది. ఎందుకంటే మనం అందరం ఆశావాదులమే’’ అని క్రికెట్ కనెక్టడ్‌ అనే షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే అన్నారు. 

Updated Date - 2020-05-28T18:25:40+05:30 IST