రోజుకు 30వేల మంది..
ABN , First Publish Date - 2020-12-11T09:12:12+05:30 IST
ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ డే టెస్టును వీక్షించేందుకు రోజుకు 30 వేల మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈనెల 26 నుంచి 30 వరకు మెల్బోర్న్లో జరిగే ఈ రెండో టెస్టు కోసం గతంలో రోజుకు 25 వేల మందికి...
![రోజుకు 30వేల మంది..](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మెల్బోర్న్: ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ డే టెస్టును వీక్షించేందుకు రోజుకు 30 వేల మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈనెల 26 నుంచి 30 వరకు మెల్బోర్న్లో జరిగే ఈ రెండో టెస్టు కోసం గతంలో రోజుకు 25 వేల మందికి మాత్రమే అనుమతి ఉన్నట్టు ప్రకటించారు. గత 40 రోజులుగా ఇక్కడ కరోనా కేసులు నమోదు కాలేదు. దీంతో స్థానిక విక్టోరియా ప్రభుత్వం ప్రేక్షకుల పరిమితిపై గురువారం ఈ నిర్ణయం తీసుకుంది.