ఎయిర్ ఇండియా రాకపోకలపై నిషేధం విధించిన హాంకాంగ్

ABN , First Publish Date - 2020-08-19T00:05:38+05:30 IST

వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిర్ ఇండియా విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న

ఎయిర్ ఇండియా రాకపోకలపై నిషేధం విధించిన హాంకాంగ్

న్యూఢిల్లీ: వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిర్ ఇండియా విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్న విషయం విధితమే. అయితే హాంకాంగ్ అధికారులు తాజాగా ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించారు. ఈ నిషేధం వల్ల భారత్ నుంచి హాంకాంగ్‌కు.. హాంకాంగ్ నుంచి భారత్‌కు ఎయిర్ ఇండియా సేవలు అందించడానికి లేదు. కరోనా నేపథ్యంలోనే ఈ నిషేధాన్ని విధించినట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 18, 21 తేదీల్లో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి రెండు విమానాలు రావాల్సి ఉంది. హాంకాంగ్ అధికారులు విధించిన ఆంక్షల కారణంగా మంగళవారం ఢిల్లీ నుంచి హాంకాంగ్‌కు.. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి నడవాల్సిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్టు సోమవారం ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇక తాజాగా నిషేధమే విధిస్తున్నట్టు వెల్లడించడంతో ఈ విమానాలు రద్దు కానున్నాయి. కాగా.. ఇప్పటివరకు 10.5 లక్షల మంది భారతీయులను విదేశాల నుంచి తీసుకొచ్చామని గత గురువారం విదేశాంగశాఖ అధికారి అనురాగ్ శ్రీవాత్సవ వెల్లడించారు.

Updated Date - 2020-08-19T00:05:38+05:30 IST