వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 16.30 లక్షల మంది భారతీయులు

ABN , First Publish Date - 2020-09-16T13:40:19+05:30 IST

కరోనా లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసుల కోసం కేంద్రం 'వందే భారత్ మిషన్'(వీబీఎం) చేపట్టిన సంగతి తెలిసిందే.

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 16.30 లక్షల మంది భారతీయులు

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసుల కోసం కేంద్రం 'వందే భారత్ మిషన్'(వీబీఎం) చేపట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా విదేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. అయితే, ఇప్పటివరకు వీబీఎం ద్వారా సుమారు 16.30 లక్షల మంది ప్రవాసులను విమాన, ఇతర మార్గాల ద్వారా ఇండియాకు తరలించడం జరిగిందని భారత పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం వెల్లడించారు.


వీబీఎం కార్యక్రమం కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు స్వదేశానికి రావడానికి ఎంతో ఉపయోగపడిందని ఆయన అన్నారు. అలాగే భారత్‌లో చిక్కుకున్న ప్రవాసులు విదేశాలకు వెళ్లడానికి కూడా ఈ కార్యక్రమం అవకాశం కల్పించిందని మంత్రి తెలిపారు. ఇక మే 7న ప్రారంభమైన వీబీఎం ఇప్పటికే ఐదు దశలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి ఆరో విడతలోకి అడుగుపెట్టింది.  

Updated Date - 2020-09-16T13:40:19+05:30 IST