యూకేలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న 'కొవిడ్'.. 31 వేలు దాటిన మరణాలు
ABN , First Publish Date - 2020-05-10T02:31:14+05:30 IST
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్... అటు అగ్రరాజ్యాలను సైతం వణికిస్తోంది. బ్రిటన్లో శరవేగంగా ప్రబలుతున్న 'కొవిడ్-19' ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 31 వేలు దాటిపోయింది.
![యూకేలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న 'కొవిడ్'.. 31 వేలు దాటిన మరణాలు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020050908593791/05092020210058n52.jpg)
లండన్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్... అటు అగ్రరాజ్యాలను సైతం వణికిస్తోంది. బ్రిటన్లో శరవేగంగా ప్రబలుతున్న 'కొవిడ్-19' ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 31 వేలు దాటిపోయింది. శుక్రవారం నమోదైన 626 మరణాలతో కలిపి ఇప్పటివరకు యూకేలో 31,241 మంది కరోనాకు బలయ్యారని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఈ వైరస్తో చనిపోయిన వారిలో 6 వారాల పసికందు కూడా ఉన్నట్లు నేషనల్ హెల్త్ సర్వీస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,15,260 మంది కరోనా బాధితులు ఉన్నారు. అమెరికా(78,762) తర్వాత కరోనాతో అధికంగా మృతి చెందిన వారు యూకేలోనే ఉన్నారు. బ్రిటన్ తర్వాత ఇటలీ(30,201), స్పెయిన్(26,478), ఫ్రాన్స్(26,230) ఉన్నాయి. అటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 2.77 లక్షల మంది మరణించారు.