యూఏఈలో 391 కొత్త కేసులు.. 143 రికవరీలు..
ABN , First Publish Date - 2020-08-22T14:47:45+05:30 IST
వారం రోజులుగా యూఏఈలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
యూఏఈ: వారం రోజులుగా యూఏఈలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో రికవరీలు తగ్గుతున్నాయి. శుక్రవారం కూడా 391 కొత్త కేసులు నమోదు కాగా... 143 రికవరీలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 66,193కు చేరితే... మొత్తం రికవరీలు 58,296 అయ్యాయి. కాగా, ఇప్పటికే 370 మంది కోవిడ్-19కు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 7,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యూఏఈ ప్రతిరోజు భారీ సంఖ్యలో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. దీంతో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ఆరు మిలియన్లకు పైగా కరోనా పరీక్షలు పూర్తి చేసింది.