యూఏఈలో లక్ష మార్క్‌ను దాటిన కరోనా కేసులు !

ABN , First Publish Date - 2020-10-07T12:35:14+05:30 IST

యూఏఈలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. వారం పదిరోజులుగా వరుసగా వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

యూఏఈలో లక్ష మార్క్‌ను దాటిన కరోనా కేసులు !

అబుధాబి: యూఏఈలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. వారం పదిరోజులుగా వరుసగా వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో తాజాగా యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటింది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 102,379 కరోనా పరీక్షల్లో 1,061 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 100,794కు చేరింది. నిన్న ఒకేరోజు 1,146 మంది మహమ్మారిని జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం రికవరీలు 90,556కు చేరగా... మరణాలు 435 అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 9,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


ఇక వైరస్ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది యూఏఈ. అయినా ప్రతిరోజు కొత్త కేసులు పెరుగుతుండడం ఆరోగ్యశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 10.2 మిలియన్ల కొవిడ్ టెస్టులు పూర్తి చేసింది. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి నియంత్రణ కష్టంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు.   

Updated Date - 2020-10-07T12:35:14+05:30 IST