జూన్ 23 నుంచి విదేశీ ప్ర‌యాణాల‌కు యూఏఈ గ్రీన్ సిగ్న‌ల్

ABN , First Publish Date - 2020-06-16T18:27:15+05:30 IST

క‌రోనా మ‌హ‌మ్మారి ఆంక్ష‌ల‌ నేప‌థ్యంలో దేశ పౌరుల‌ను విదేశీ ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ఇవ్వ‌ని యూఏఈ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

జూన్ 23 నుంచి విదేశీ ప్ర‌యాణాల‌కు యూఏఈ గ్రీన్ సిగ్న‌ల్

యూఏఈ: క‌రోనా మ‌హ‌మ్మారి ఆంక్ష‌ల‌ నేప‌థ్యంలో దేశ పౌరుల‌ను విదేశీ ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ఇవ్వ‌ని యూఏఈ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జూన్ 23 నుంచి దేశ పౌరుల‌ను విదేశాల‌కు వెళ్లేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మ‌రియు ఇంట‌ర్నెష‌న‌ల్ కోఆప‌రేష‌న్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఐసీఏ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సీఈఎంఏ) సంయుక్తంగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. ప్ర‌భుత్వం అనుమ‌తి పొంది.. ఎంపిక కాబ‌డిన పౌరులు, నివాసితుల‌ను కొన్ని గమ్యస్థానాలకు వెళ్లడానికి యూఏఈ అనుమ‌తించ‌నుంది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని సంబంధిత అధికారులు తెలిపారు. జ‌ర్నీ స‌మ‌యంలో ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నియంత్ర‌ణకు సంబంధించిన‌ నియమ నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. ‌దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను యూఏఈ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ వెల్ల‌డించ‌నుంది.     

Updated Date - 2020-06-16T18:27:15+05:30 IST