సొంతూరిలో లాక్డౌన్ సహాయక చర్యలు చేపట్టిన ప్రవాసాంధ్రుడు
ABN , First Publish Date - 2020-05-17T21:55:09+05:30 IST
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ పేదలను ఆదుకోవటానికి ఎన్ఆర్ఐలు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని రేపల్లె మం

రేపల్లె: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ పేదలను ఆదుకోవటానికి ఎన్ఆర్ఐలు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలంలో ఉన్న తుమ్మల గ్రామానికి చెందిన గరికపాటి సకలయ్య అమెరికాలో ఉంటున్నారు. స్థానికంగా ఉన్న మిత్రులతో కలిసి తన స్వగ్రామంలో సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 800 పేద కుటుంబాలకు పోషక విలువను పెంచే ఆహారాన్ని అందించారు. కూరగాయలతో పాటు ఒక్కో కుటుంబానికి 30గుడ్లు చొప్పున మెత్తం 24వేల గుడ్లు పంపిణీ చేశారు. ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సకలయ్య తెలిపారు.