పట్టెడన్నం కోసం గంటల తరబడి క్యూలైన్ లో.. కువైత్లో ప్రవాసుల పాట్లు!
ABN , First Publish Date - 2020-06-16T16:03:10+05:30 IST
కువైత్ వెళ్లిన వారి పరిస్థితి రోజురోజుకు మరింత దయనీయంగా మారుతోంది. ప్రస్తుతం కువైత్లో కరోనా లాక్డౌన్ కఠినతరంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.

రాజంపేట(కడప): కువైత్ వెళ్లిన వారి పరిస్థితి రోజురోజుకు మరింత దయనీయంగా మారుతోంది. ప్రస్తుతం కువైత్లో కరోనా లాక్డౌన్ కఠినతరంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పట్టెడన్నం కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి న దుస్థితి. కువైత్లో తెలుగువారితో పాటు ఇతర దేశస్థులు లక్షలాది మంది ఉన్నారు. అక్కడి ప్రభుత్వం అనేక చోట్ల వీరికి భోజన ఏర్పాట్లు చేస్తోంది. భోజనం కోసం ఒక్కసారిగా వేలాది మంది బారులుతీరడంతో తోపులాటలు జరుగుతున్నాయి. ఈ విషయమై ఏపీఎన్ఆర్టీ కడప జిల్లావాసులైన ముమ్మడి బాలిరెడ్డి, ఎం.వి.నరసారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్లో మాట్లాడుతూ ప్రస్తుతం లాక్డౌన్ దృష్ట్యా కువైత్లో మనవారు చాలామంది నానా అగచాట్లు పడుతన్నారని తెలిపారు.