విజిటింగ్ వీసాపై యూఏఈ వెళ్లి.. చిక్కుకుపోయిన వారికి తీపి కబురు

ABN , First Publish Date - 2020-03-24T17:03:08+05:30 IST

కరోనా వైరస్(కొవిడ్-19) వ్యాప్తి, నియంత్రణలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలను మూసివేసింది.

విజిటింగ్ వీసాపై యూఏఈ వెళ్లి.. చిక్కుకుపోయిన వారికి తీపి కబురు

యూఏఈ: కరోనా వైరస్(కొవిడ్-19) వ్యాప్తి, నియంత్రణలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలను మూసివేసింది. దీంతో ఆ దేశం వెళ్లిన విదేశీయులు అక్కడే చిక్కుకుపోయారు. విజిటింగ్ వీసాపై వెళ్లినవారిని వీసా గడువు సమీపిస్తుండడం, మరికొందరి గడువు ముగిసిపోవడంతో భయపడుతున్నారు. ఎందుకంటే వీసా గడువు ముగిసిన తర్వాత ఆ దేశంలో ఉండి పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయి. అలాంటి వారికి యూఏఈ ప్రభుత్వం తాజాగా తీపి కబురు అందించింది.


విజిటింగ్ వీసాపై తమ దేశానికి వచ్చి... ఎయిర్‌పోర్ట్స్ మూసివేయడంతో అక్కడే చిక్కుకుపోయిన విదేశీయులు.. వీసా గడువు ముగిసిన యూఏఈలోనే ఉండొచ్చని తెలిపింది. కరోనా నేపథ్యంలో విమానాశ్రయాలు క్లోజ్ చేయడంతో యూఏఈలో ఉండిపోయిన విజిటింగ్ వీసా దారులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. యూఏఈ తాజా నిర్ణయంతో ఆ దేశం వెళ్లి చిక్కుకున్న భారతీయులకు ప్రధానంగా కేరళ వాసులకు ఉపశమనం కలిగించింది.  

Updated Date - 2020-03-24T17:03:08+05:30 IST