కువైట్లో 66వేల మార్కును దాటిన రికవరీలు !
ABN , First Publish Date - 2020-08-14T18:13:20+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం నుంచి కువైట్ క్రమంగా కోలుకుంటోంది. అంతకంతకు రివకరీలు పెరుగుతున్నాయి.
కువైట్ సిటీ: మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం నుంచి కువైట్ క్రమంగా కోలుకుంటోంది. అంతకంతకు రివకరీలు పెరుగుతున్నాయి. తాజాగా రికవరీలు 66వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 701 కొత్త కేసులు నమోదైతే... 648 రికవరీలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోవిడ్ సోకిన వారి సంఖ్య 74,486కు చేరగా... మొత్తం రికవరీలు 66,099 అయ్యాయి. ఇప్పటికే 489 మంది ఈ వైరస్కు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 7,898 మంది కరోనా రోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక విశ్వవ్యాప్తంగా విలయం సృష్టిస్తున్న కరోనా ఇప్పటికే 7.57 లక్షల మందిని కబళించింది. అలాగే రెండు కోట్ల 10 లక్షల మందికి ప్రబలింది.