నిద్రలోకి జారుకున్న భారత ప్రవాసీ.. వదిలేసి వెళ్లిపోయిన విమానం
ABN , First Publish Date - 2020-07-05T13:37:30+05:30 IST
ఒక వలసదారుడు అలసి నిద్రలోకి జారుకోవడంతో అతడిని వదిలేసి విమానం వెళ్లిపోయింది.
దుబాయ్, జూలై 7: ఒక వలసదారుడు అలసి నిద్రలోకి జారుకోవడంతో అతడిని వదిలేసి విమానం వెళ్లిపోయింది. యూఏఈలో చిక్కుకున్న కేరళవాసుల తరలింపునకు ఇక్కడి కేరళ ముస్లిం కల్చరల్ అసోసియేషన్(కేఎంసీసీ) ఒక చార్టర్డ్ విమానం ఏర్పాటు చేసింది. సుమారు రూ.22వేలు చెల్లించి పి.షాజహాన్ అందులో టికెట్ కొనుక్కున్నారు. అయితే, విమానం బయలుదేరే సమయానికి ఆయన నిద్రలోకి జారుకున్నారు. టికెట్ నిర్ధారణ కోసం ఎదురుచూడడంతో ఆ ముందురోజు రాత్రి తనకు నిద్రలేదని, తర్వాత రోజు కూడా సాయంత్రం వరకూ తనిఖీ తదితర ప్రక్రియ కొనసాగిందని షాజహాన్ చెప్పారు. అందువల్ల అలసిపోవడంతో నిద్ర పట్టేసిందన్నారు.