ఎన్‌టీఆర్ సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో పసుపు-కుంకుమ కార్యక్రమం!

ABN , First Publish Date - 2020-09-13T20:43:15+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ఎపీ ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ఆడపడుచుల కోసం పసుము

ఎన్‌టీఆర్ సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో పసుపు-కుంకుమ కార్యక్రమం!

కువైట్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ఎపీ ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ఆడపడుచుల కోసం పసుము కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇదే స్పూర్తితో ఎన్‌టీఆర్ సేవా సమితి కువైట్ అధ్యక్షుడు చుండు బాలరెడ్డయ్య.. టీడీపీ కువైట్ వారి సహకారంతో కువైట్‌లో పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగింటి ఆడపడుచులకు చీర, పసుపు-కుంకుమలను అందజేశారు. షేక్ సుబాన్, గుదె నాగార్జున, ఆంజనరెడ్డి, ఏనుగొండ నరసింహ నాయుడు, షేక్ హాబిబ్ ఆధ్వర్యంలో హవల్లి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు, చంద్రబాబు ఆశయ సాధన కోసం నిరంతరం పని చేస్తామన్నారు. ఆడపడుచులను పసుపు-కుంకుమ కార్యక్రమం కింద గౌరవించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిన ఈశ్వర్ నాయుడు, ఈపుడుగంటి ప్రసాద్, విక్రమ్ ఆంజి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-13T20:43:15+05:30 IST