వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 14లక్షల మంది భారతీయులు!

ABN , First Publish Date - 2020-09-18T02:24:27+05:30 IST

కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగశాఖ సహాయ మం

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 14లక్షల మంది భారతీయులు!

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగశాఖ సహాయ మంత్రి మురళీధరన్ వెల్లడించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన.. ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు 14,12,834 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ఆరో విడత ‘వందే భారత్ మిషన్ ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 24 వరకు ఈ దశ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విడతలో మొత్తం 1,007 అంతర్జాతీయ విమానాలు.. భారతీయులను స్వదేశానికి తరలించనున్నాయని చెప్పారు. కాగా.. ‘వందే భారత్ మిషన్’ మే 7న ప్రారంభమైన విషయం తెలిసిందే.


Updated Date - 2020-09-18T02:24:27+05:30 IST