విదేశాల నుంచి ఇష్టదైవానికి ఆన్లైన్ పూజలు
ABN , First Publish Date - 2020-07-19T14:07:55+05:30 IST
విదేశాల్లో ఉన్న భక్తులకు తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ పూజా సౌకర్యాన్ని కల్పించేందుకు దేవాదాయశాఖ చర్యలు చేపట్టింది.

హైదరాబాద్, జూలై 18(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉన్న భక్తులకు తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ పూజా సౌకర్యాన్ని కల్పించేందుకు దేవాదాయశాఖ చర్యలు చేపట్టింది. పుట్టినరోజు, పెళ్లి రోజు ఇతర ఏ శుభకార్యాన్ని అయినా పురస్కరించుకుని విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు ఇకపై ఆన్లైన్లో తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహించుకోవచ్చు. త్వరలోనే భద్రాద్రి, యాదాద్రి, బాసర సరస్వతి, వేములవాడ, తదితర ఆలయాల్లో తమ వారిపేరుమీద పూజలు జరిపించుకునేందుకు వీలు ఏర్పడుతుంది. ఈ-హుండీ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నారు.