సౌదీ నుంచి వచ్చిన ఎన్నారై.. కరోనాతో మృతి !
ABN , First Publish Date - 2020-07-15T18:30:47+05:30 IST
ఈ నెల మొదటి వారంలో సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి వచ్చిన ఎన్నారై తాజాగా కరోనాతో మృతి చెందాడు.
అలప్పుజ(కేరళ): ఈ నెల మొదటి వారంలో సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి వచ్చిన ఎన్నారై తాజాగా కరోనాతో మృతి చెందాడు. కేరళలోని చునక్కరాకు చెందిన ఎన్నారై... అలప్పుజలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఎన్నారై మరణించిన తర్వాత అతని నుంచి శాంపుల్స్ సేకరించి కోవిడ్ టెస్టు చేయగా పాజిటివ్గా తేలిందని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించింది. కాగా, క్యాన్సర్ చికిత్స కోసం మొదట కొట్టాయం మెడికల్ కాలేజీకి వెళ్లిన ఎన్నారైని అక్కడి వైద్యులు అలప్పుజలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పంపించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడని అధికారులు తెలియజేశారు.