యూఏఈలో ఆరు మిలియన్ల చేరువలో కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-08-18T15:32:32+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు యూఏఈ విరివిగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.
![యూఏఈలో ఆరు మిలియన్ల చేరువలో కరోనా పరీక్షలు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020081810013787/08182020100225n79.jpg)
యూఏఈ: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు యూఏఈ విరివిగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు 60 నుంచి 70వేల కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న యూఏఈ... సోమవారం కూడా దేశవ్యాప్తంగా 71వేల కరోనా పరీక్షలు చేసింది. దీంతో ఆ దేశంలో మొత్తం కోవిడ్ టెస్టులు ఆరు మిలియన్ల చేరువలో ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, ఈ నెలాఖరు వరకు ఆరు మిలియన్ల కరోనా పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న యూఏఈ ఆ దిశగా దూసుకెళ్తోంది.
ఇక సోమవారం యూఏఈలో పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. 229 కొత్త కేసులు నమోదు కాగా... 100 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 64,541కు చేరితే... మొత్తం రికవరీలు 57,794 అయ్యాయి. ఇప్పటికే యూఏఈ వ్యాప్తంగా 364 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం దేశంలో 6,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి.