అమెరికాలో ఓటేసిన 5.9 కోట్లమంది.. 2016 కంటే అరాచక పరిస్థితులు..!
ABN , First Publish Date - 2020-10-27T14:31:26+05:30 IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 9 రోజుల గడువుంది. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్! అయితే ఇప్పటికే 5.9 కోట్ల మంది ఓటేసేశారు. మొత్తం 24 కోట్ల మంది ఓటర్లలో దాదాపు నాలుగోవంతు ఓటర్లు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకోవడం అమెరికా చరిత్రలోనే ఓ రికార్డు. ఇంకా చెప్పాలంటే 2016లో పడిన మొత్తం ఓట్లలో
![అమెరికాలో ఓటేసిన 5.9 కోట్లమంది.. 2016 కంటే అరాచక పరిస్థితులు..!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020102708583894/10272020090120n54.jpg)
ముందస్తు ఓటింగ్లో ఇదో రికార్డు
పోస్టల్, ఈమెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటు
ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం
వాషింగ్టన్ (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 9 రోజుల గడువుంది. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్! అయితే ఇప్పటికే 5.9 కోట్ల మంది ఓటేసేశారు. మొత్తం 24 కోట్ల మంది ఓటర్లలో దాదాపు నాలుగోవంతు ఓటర్లు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకోవడం అమెరికా చరిత్రలోనే ఓ రికార్డు. ఇంకా చెప్పాలంటే 2016లో పడిన మొత్తం ఓట్లలో 42 శాతం ఈసారి ఎన్నికల్లో ముందస్తుగానే బ్యాలెట్లకు చేరాయి. 16 కీలక రాష్ట్రాల నుంచే ఈ మొత్తం ఓట్లు పడ్డాయి. కరోనావైరస్ ఉధృతంగా కాటేస్తుండడంతో బయటకు- అంటే పోలింగ్ కేంద్రాలకు రావడానికి సాహసించని ఓటర్లు ఈసారి పోస్టల్, ఈమెయిల్ బ్యాలెటింగ్కు మొగ్గుచూపారు. నవంబరు 3నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చంటున్నారు.
ఈ ముందస్తు ఓటింగ్ కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యం కావొచ్చని, ఎందుకంటే మొత్తం పోలింగ్ పూర్తయ్యాకే పోస్టల్, మెయిల్ ఓట్ల లెక్కింపు కూడా మొదలవుతుందని, ఈ లెక్కింపునకు కాస్త ఎక్కువ సమయం పడుతుందని, పోలింగ్ జరగిన రోజు రాత్రే వెలువడడం అసాధ్యమని, కొన్ని రోజులపాటు సాగొచ్చని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ తెలిపింది. ఇది 2016 కంటే ఎక్కువగా అరాచక పరిస్థితులకు దారితీసినా ఆశ్చర్యపోనక్కరలేదని పేర్కొంది.