కరోనా వారియర్స్ను ప్రోత్సహిస్తున్న నాట్స్..!
ABN , First Publish Date - 2020-06-26T03:50:33+05:30 IST
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో కరోనాపై ముందుండి పోరాడుతున్న వారిని నాట్స్ ప్రోత్సహిస్తోంది. ఇందులో భా

టెంపా బే: అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో కరోనాపై ముందుండి పోరాడుతున్న వారిని నాట్స్ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా.. టెంపాబేలోని పస్కో కౌంటీ షిరీఫ్ ఆఫీస్ డిస్ట్రిక్ట్-2లోని నైట్ షిఫ్టు అధికారులకు నాట్స్ భోజనం ఏర్పాటు చేసి కృతజ్ఙతలు తెలిపింది. నాట్స్ టెంపాబే టీం సభ్యులు దాదాపు 50 మందికి భోజన ప్యాకెట్లు సిద్ధం చేసి, వారి కార్యాలయంలో అందించింది. కరోనాపై పోరులో అధికారుల శ్రమను గుర్తించి, భోజనాలు అందించినందుకు కౌంటీ కమిషనర్ మైక్ మూరే.. నాట్స్ను అభినందించారు. కష్టకాలంలో మంచి కార్యక్రమాలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీంతో పాటు నాట్స్ పకో, పస్కో కౌంటీల్లోని ఫైర్ స్టేషన్లలో పని చేసే సిబందికి కూడా నాట్స్.. భోజన ప్యాకెట్లు అందించింది. రమ్య పిన్నమనేని, విజయ్, ఫణి దలయ్, సోమంచి కుటుంబం, డాక్టర్ పూర్ణ, తార బిక్కసాని, డాక్టర్ సుదర్శన్, రమ కామిశెట్టిలు ఈ ఆహారాన్ని అందించేందుకు అధిక సాయం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, రాజేశ్ కాండ్రు, ప్రసాద్ ఆరికట్ల, సతీశ్ పాలకుర్తి, నగేష్ నాయక్ తదితరులు కీలక పాత్ర పోషించారు.