భారత సంతతి వ్యక్తికి అరుదైన అవకాశం..!

ABN , First Publish Date - 2020-12-11T21:04:32+05:30 IST

భారత సంతతికి చెందిన రాజా జాన్ వుర్పుత్తూర్ చారికి అరుదైన అవకాశం లభించింది. జాబిల్లిపై అడుగుపెట్టే అవకాశాన్ని కొట్టేశారు. వ్యోమగాములను చంద్రడిపైకి పంపే మూన్ మిషన్ ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్’కు రాజా

భారత సంతతి వ్యక్తికి అరుదైన అవకాశం..!

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన రాజా జాన్ వుర్పుత్తూర్ చారికి అరుదైన అవకాశం లభించింది. జాబిల్లిపై అడుగుపెట్టే అవకాశాన్ని  కొట్టేశారు. వ్యోమగాములను చంద్రడిపైకి పంపే మూన్ మిషన్ ‘ఆర్టెమిస్  ప్రాజెక్ట్’కు రాజా జాన్ వుర్పుత్తూర్ ఎంపికయ్యారని నాసా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసినట్టు తెలిపిన నాసా.. ఇందులో 9 మంది మహిళలు ఉన్నట్టు పేర్కొంది. కాగా.. ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌ కోసం ఎంపికైన బృందంలో తనకు చోటు లభించడంపట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. 43ఏళ్ల రాజా జాన్ వుర్పుత్తూర్.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2017లో ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్‌కు ఎంపికయ్యారు. ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకుని.. తాజాగా ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్’కు ఎంపికయ్యారు. 


Updated Date - 2020-12-11T21:04:32+05:30 IST