మోదీ నన్ను అభినందించారు: ట్రంప్
ABN , First Publish Date - 2020-09-14T14:14:30+05:30 IST
ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు. అమెరికాలో కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై మోదీ అబ్బురపడ్డారని, భారీ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారని తనను అభినందించారని ట్రంప్ చెప్పారు. నెవాడాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. భారత్తో పోలిస్తే అమెరికాలో..
వాషింగ్టన్, సెప్టెంబరు 13: ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు. అమెరికాలో కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై మోదీ అబ్బురపడ్డారని, భారీ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారని తనను అభినందించారని ట్రంప్ చెప్పారు.
నెవాడాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. భారత్తో పోలిస్తే అమెరికాలో 44లక్షల కరోనా పరీక్షలను ఎక్కువగా నిర్వహించామని తెలిపారు. ఈ ఘనతపైనే మోదీ తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని ట్రంప్ గుర్తు చేశారు. కరోనా కట్టడికి గట్టిగానే పోరాడుతున్నామనే సందేశాన్ని అమెరికన్లలోకి పంపేందుకే ఈవ్యాఖ్యలు చేశారని అంటున్నారు.