లండన్‌లో నిరాడంబరంగా విత్తన గణపతి వేడుకలు, నిమజ్జనం

ABN , First Publish Date - 2020-09-01T23:09:56+05:30 IST

హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(హెచ్‌వైఎఫ్‌వై) లండన్ ఆధ్వర్యంలో 8వ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.

లండన్‌లో నిరాడంబరంగా విత్తన గణపతి వేడుకలు, నిమజ్జనం

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి స్ఫూర్తితోనే విత్తన గణపతి వేడుకలు

లండన్: హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(హెచ్‌వైఎఫ్‌వై) లండన్ ఆధ్వర్యంలో 8వ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్‌కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరంలో నిరాడంబరంగా "విత్తన గణపతి వేడుకలు, నిమజ్జనం" జరిగింది. ఈ సంవత్సరం కరోనా నిబంధన నేపథ్యంలో ప్రజల భద్రతా దృష్ట్యా వేడుకలను నిరాడంబరంగా నిర్వహించినట్టు హైఫై (హెచ్‌వైఎఫ్‌వై) అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. కరోనా నింబంధలను పాటిస్తూనే సంప్రాదాయ బద్దంగా తొమ్మిది రోజులు పూజలు, హోమాలు నిర్వహించామని, ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు స్ఫూర్తితోనే ఈ సంవత్సరం "విత్తన గణపతి"ని ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు మా వంతు బాధ్యతను నిర్వహించామని అశోక్ తెలిపారు.


హైఫై(హెచ్‌వైఎఫ్‌వై) నాయకుడు మల్లా రెడ్డి బీరం మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం గణేష్ వేడుకలను ఎన్నారై మిత్రులందరితో కలిసి, లండన్ వీధుల్లో ఊరేగింపుతో మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా నిర్వహిస్తామని చెప్పారు. కానీ ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా నిరాడంబరంగా వేడుకల్ని నిర్వహించామన్నారు. దీనికి సహకరించిన కార్యవర్గ సభ్యులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా తొమ్మిది రోజులు మాకు సలహాలు సూచనలు అందించడమే కాకుండా 8 సంవత్సరాల నుండి హైఫై(హెచ్‌వైఎఫ్‌వై) కార్యవర్గాన్ని ముందుకు నడిపిస్తున్న అనిల్ కూర్మాచలంకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.


మరో నాయకుడు సత్య చిలుముల మాట్లాడుతూ ప్రజలందరినీ భగవంతుడు కరోనా నుండి రక్షించాలనే సంకల్పంతోనే నిత్యం పూజలు నిర్వహించడమే కాకుండా ప్రత్యేక గణపతి హోమం నిర్వహించామని తెలిపారు. కరోనా నిబంధలను పాటిస్తూ తొమ్మిది రోజులు అనుక్షణం అన్ని జాగ్రత్తలు తీసుకొని సంప్రదాయ బద్దంగా అన్ని రకాల పూజలు  నిరవహించామని నాయకుడు సతీష్ గొట్టెముక్కల తెలియజేశారు. సహకరించి ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఇంటి ఆవరణలో వేడుకలకు అన్ని రకాలుగా సహకరించిన మల్లా రెడ్డి, శుష్మణ దంపతులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.


ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో అశోక్-జాహ్నవి, మల్లా రెడ్డి-శుష్మణ దంపతులతో పాటు, సత్య చిలుముల, సతీష్ రెడ్డి గొట్టెముక్కల పది రోజుల పాటు ఎక్కడికీ వెళ్లకుండా నవరాత్రి పూజలకే అంకితమై... ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని లోక కళ్యాణానికై వీరు చేసిన గణపతి సేవ ఎంతో స్ఫూర్తినిచ్చిందని అనిల్ కూర్మాచలం వారిని ప్రత్యేకంగా అభినందించారు.


తొమ్మిది రోజులు పూజించిన గణపతి లడ్డుని నిర్వాహకులు అశోక్-జాహ్నవి, మల్లా రెడ్డి-శుష్మణ దంపతులకు అందజేశారు. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ లడ్డు తీసుకుంటున్నామని, మా కార్యవర్గ సభ్యులకు, మిత్రులకి, వీలైనంతమందికి లడ్డూ ప్రసాదాన్ని పంపిస్తామని అశోక్, మల్లారెడ్డి తెలిపారు. చివరగా ఆట పాటలతో వీడ్కొలు పలుకుతూ విత్తన గణపతిని ఇంటి ఆవరణలోనే తొట్టిలో నిమజ్జనం చేశారు.


తొమ్మిది రోజులుగా వివిధ సందర్భాల్లో పూజలు నిర్వహించి సహకరించిన ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం - ప్రభలత దంపతులకు, టాక్ అధ్యక్షురాలు పవిత్ర - సత్యం రెడ్డి దంపతులకు, ఇతర ప్రతినిధులు రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, స్వప్న, స్వాతి బుడగం, సురేష్ బుడగం, శశిధర్, మౌనిక, రవి రేతినేని, క్రాంతి, హరి నవాపేట్, స్నేహ, సుభాష్ మెగావత్, ప్రియాంక, నరేష్ జక్కుల, నరేంద్ర జక్కుల, భూషణ్ బుప్పుల, నాగరాజ్  గారిపల్లి, వీర్ నాయుడు శ్రీకాంత్ జెల్లా, శైలజా, రాజ్ బజార్ తదితరులందరికీ హైఫై(హెచ్‌వైఎఫ్‌వై) కార్యవర్గం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపింది.     



Updated Date - 2020-09-01T23:09:56+05:30 IST