న్యూజీలాండ్ టీఆర్ఎస్ శాఖ కొత్త అధ్యక్షుడిగా జగన్ మోహన్ రెడ్డి
ABN , First Publish Date - 2020-08-08T19:47:06+05:30 IST
న్యూజీలాండ్ టీఆర్ఎస్ శాఖ కొత్త అధ్యక్షుడిగా జగన్ మోహన్ రెడ్డి ఓడనాలా నియామకం అయ్యారు.
న్యూజీలాండ్ టీఆర్ఎస్ శాఖ కొత్త అధ్యక్షుడిగా జగన్ మోహన్ రెడ్డి ఓడనాలా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి కొసన మాట్లాడుతూ కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో న్యూజీలాండ్ శాఖను 2016లో ప్రారంభించారని చెప్పారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాలాకు వివరించినట్లుగా కేసీఆర్ చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావడానికి ఒక సైనికుడి వలే పనిచేస్తూ... అలాగే కొత్త అధ్యక్షుడికి, కొత్తగా ఏర్పడే కమిటీకి తన సహాయ సహకారాలు ఎప్పటికి వుంటాయని తెలిపారు.
గత నాలుగు సంవత్సరాలుగా టీఆర్ఎస్ శాఖకు అధ్యక్షుడిగా విజయ భాస్కర్ రెడ్డి కొసన పలు పార్టీ, సేవ కార్యక్రమాలతో పార్టీ అభివృద్ధికి కృషి చేశారని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత సంప్రదించి, ప్రస్తుత ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న జగన్ మోహన్ రెడ్డి ఓడనాలాను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తనను టీఆర్ ఎస్ న్యూజిలాండ్ శాఖ అధ్యక్షుడిగా నియమించినందుకు కవిత, మహేష్ బిగలాకు ధన్యవాదాలు తెలుపుతూ... కేసీఆర్, టీఆర్ఎస్ విధానాలను ప్రచారం కల్పించి ప్రవాస తెలంగాణ బిడ్డలతో మమేకం అవుతామని నూతన అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఓడనాలా చెప్పారు.
కొత్త కమిటీ వివరాలు...
అధ్యక్షుడు - జగన్ మోహన్ రెడ్డి ఓడనాలా
హోనోరారి చైర్ పర్సన్ - నరసింగ రావు ఇనగంటి
జనరల్ సెక్రటరీ - అరుణ్ ప్రకాష్ రెడ్డి
ఉపాధ్యక్షులు (3)
రామా రావు రాచకొండ
అభిలాష్ రావు యాచమనేని
కిరణ్ కుమార్ పోకల
వరుణ్ రావు మేచినేని - కోశాధికారి
సునీత విజయ్ - ఉమెన్స్ అఫైర్స్ చైర్ పర్సన్
ఇంద్ర సిరిగిరి - బిజినెస్ అఫైర్స్ చైర్ పర్సన్
సుజిత్ సింగ్ - ఇమ్మిగ్రేషన్ అఫైర్స్ చైర్ పర్సన్
మోహన్ రెడ్డి బీరపు - నార్త్ ఐలాండ్ ఇంచార్జి
పానుగంటి శ్రీనివాస్- సౌత్ ఐలాండ్ ఇంచార్జి
రాజేశ్వరి కొండగారి - ఈవెంట్స్ ఇంచార్జి
శ్రీహరి రావు బండ - యూత్ ఇంచార్జి
ఆష్ వొదినాల - స్పోర్ట్స్ ఇంచార్జి