భారతీయ సోదరుల చేతికి బ్రిటిష్ సూపర్ మార్కెట్ !
ABN , First Publish Date - 2020-10-03T12:15:52+05:30 IST
బ్రిటన్లోనూ భారత సంతతి ప్రజలు తమ వ్యాపార సత్తా చాటుతున్నారు.

లండన్ : బ్రిటన్లోనూ భారత సంతతి ప్రజలు తమ వ్యాపార సత్తా చాటుతున్నారు. మొహిసిన్, జుబెర్ ఇసా అనే భారత సంతతి సోదరులు ఆ దేశానికి చెందిన ‘ఏఎస్డీఏ’ అనే సూపర్ మార్కెట్ రిటైల్ వ్యాపార సంస్థ ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు చేశారు. అమెరికా రిటైల్ వ్యాపార దిగ్గజం ‘వాల్మార్ట్’ నుంచి వీరు ఈ వాటా కొనుగోలు చేయడం విశేషం. దాదాపు 880 కోట్ల డాలర్ల విలువైన ఈ డీల్లో టీడీఆర్ క్యాపిటల్ అనే పీఈ సంస్థ కూడా కొంత పెట్టుబడి పెట్టింది. ఇసా సోదరులు ఇప్పటికే యూరో గ్యారేజీ పేరుతో బ్రిటన్లో పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. వీరి తల్లిదండ్రులు 1970వ దశకంలో గుజరాత్ నుంచి బ్రిటన్కు వలస వెళ్లారు.