భారతీయ సోదరుల చేతికి బ్రిటిష్‌ సూపర్‌ మార్కెట్‌ !

ABN , First Publish Date - 2020-10-03T12:15:52+05:30 IST

బ్రిటన్‌లోనూ భారత సంతతి ప్రజలు తమ వ్యాపార సత్తా చాటుతున్నారు.

భారతీయ సోదరుల చేతికి బ్రిటిష్‌ సూపర్‌ మార్కెట్‌ !

లండన్‌ : బ్రిటన్‌లోనూ భారత సంతతి ప్రజలు  తమ వ్యాపార సత్తా చాటుతున్నారు. మొహిసిన్‌, జుబెర్‌ ఇసా అనే భారత సంతతి సోదరులు ఆ దేశానికి చెందిన ‘ఏఎస్‌డీఏ’ అనే సూపర్‌ మార్కెట్‌ రిటైల్‌ వ్యాపార సంస్థ ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు చేశారు. అమెరికా రిటైల్‌ వ్యాపార దిగ్గజం ‘వాల్‌మార్ట్‌’ నుంచి వీరు ఈ వాటా కొనుగోలు చేయడం విశేషం. దాదాపు 880 కోట్ల డాలర్ల విలువైన ఈ డీల్‌లో టీడీఆర్‌ క్యాపిటల్‌ అనే పీఈ సంస్థ కూడా కొంత పెట్టుబడి పెట్టింది. ఇసా సోదరులు ఇప్పటికే యూరో గ్యారేజీ పేరుతో బ్రిటన్‌లో పెట్రోల్‌ బంకులు నిర్వహిస్తున్నారు. వీరి తల్లిదండ్రులు 1970వ దశకంలో గుజరాత్‌ నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లారు. 

Updated Date - 2020-10-03T12:15:52+05:30 IST