యూఏఈలో చిక్కుకున్న భారత ప్రవాసులకు ఉచిత వసతి!
ABN , First Publish Date - 2020-12-26T12:48:10+05:30 IST
సౌదీ అరేబియా, కువైత్ దేశాలు సరిహద్దుల ను మూసివేసిన దరిమిలా వందల సంఖ్యలో విదేశీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చిక్కుకుపోయారు. కొత్త రకం వైర్సను అడ్డుకునే చర్యల్లో భాగంగా సౌదీ, కువైత్లు తమ దేశాల సరిహద్దులను మూసివేసింది.
![యూఏఈలో చిక్కుకున్న భారత ప్రవాసులకు ఉచిత వసతి!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122607162525/12262020071718n93.jpg)
రియాద్, డిసెంబరు 25: సౌదీ అరేబియా, కువైత్ దేశాలు సరిహద్దుల ను మూసివేసిన దరిమిలా వందల సంఖ్యలో విదేశీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చిక్కుకుపోయారు. కొత్త రకం వైర్సను అడ్డుకునే చర్యల్లో భాగంగా సౌదీ, కువైత్లు తమ దేశాల సరిహద్దులను మూసివేసింది. విమానాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈలో చిక్కుకుపోయిన 300 మంది ప్రవాసులకు అధికారులు ఉచిత వసతి కల్పించా రు. స్వదేశం నుంచి సౌదీ, కువైత్లకు నేరుగా విమానాలు రద్దు కావడంతో ప్రత్యామ్నాయ మార్గంలో యూఏఈ మీదుగా వెళ్తూ చిక్కుకుపోయారు.