ఇవాళ్టి నుంచి భారత్-కెనడా మధ్య విమాన సర్వీసులు ప్రారంభం
ABN , First Publish Date - 2020-08-15T13:35:04+05:30 IST
భారత్-కెనడా మధ్య శనివారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 14: భారత్-కెనడా మధ్య శనివారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. 5 నెలల తర్వాత ఇరు దేశాల మధ్య విమాన సేవలను పునరుద్ధరిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్-కెనడా మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందం అమలులోకి రానుంది. టొరంటో-న్యూఢిల్లీ మధ్య శనివారం నుంచి ఎయిర్ కెనడా సర్వీసులను నడపనుంది.